Saturday, July 2, 2016

పుష్కర పనులు పూర్తికాకపోతే అధికారులపై చర్యలు

పుష్కర పనుల్లో వేగం పెంచండి; చంద్రబాబు


కృష్ణా పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పుష్కర పనులు పూర్తి చేయడానికి నెల మాత్రమే సమయం ఉందని, పనులు ముమ్మరం చేయాలని సూచించారు. నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తికాకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. భక్తుల కోసం రహదారికి ఒక వైపు బారికేడ్లు ఏర్పాటు చేయాలి, రహదారి నిర్మాణం, విద్యుత్‌ పనులు వేగంగా సాగాలని పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల కోసం ప్రభుత్వం రూ.216.42 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.

No comments:

Post a Comment