Saturday, July 2, 2016

తిరుమల భక్తులకోసం రెండు బస్సులు

వెంకన్నకు రెండు బస్సులు బహుకరణ



తిరుమల శ్రీవారికి కోల్ కతాకు చెందిన ప్రకాష్ చౌదరి అనే భక్తుడు రెండు బస్సులను విరాళంగా ఇచ్చారు. తిరుమల భక్తుల ఉచిత రవాణాకు ఈ బస్సులు ఉపయోగపడనున్నాయి. ప్రకాష్ శనివారం ఉదయం ఈ బస్సులను టీటీడీ అధికారులకు అందించారు. రెండు బస్సుల విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుంది. ధర్మ రథం బస్సుల పేరుతో వాటిని భక్తులకోసం ఉపయోగిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment