Saturday, July 2, 2016

ప్రేమించకపోతే ఇక అంతే

ప్రేమించలేదని గొంతు కోశాడు


ప్రేమించలేదన్న నెపంతో యువతి గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. భైంసా పట్టణంలోని గోపాల్‌నగర్‌లో పట్టపగలే నడిరోడ్డుపై యువతిని కిరాతంగా హత్య చేశాడో ఉన్మాది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం గోపాల్‌నగర్‌లో నివాసముంటున్న సంధ్య(16)ను అదే వీధికి చెందిన మహేష్‌ హత్య చేసి పారిపోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ అందెరాములు, సీఐ రఘు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడు మహేష్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

No comments:

Post a Comment