Wednesday, June 22, 2016

బస్సుకంటే విమానం ఎక్కటమే నయం

బస్సు రేటుకే విమాన ప్రయాణం - స్పైస్ జెట్ బంపర్ ఆఫర్లు


ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ‘మాన్‌సూన్‌ బొనాంజా సేల్‌’ పేరుతో ఆఫర్లను ప్రకటించింది. దేశీయ రూట్లలో పలు విమాన టిక్కెట్లపై ఆఫర్‌లు ప్రకటించింది. ఒకవైపు ప్రయాణం ప్రారంభ ధర రూ.444 అని తెలిపింది. జమ్ము-శ్రీనగర్‌, అహ్మదాబాద్‌-ముంబయి, ముంబయి-గోవా, దిల్లీ-డెహ్రడూన్‌, దిల్లీ-అమృత్‌సర్‌ రూట్లలో ఒక వైపు ఛార్జీ రూ.444 మాత్రమేనని పేర్కొంది. అయితే మిగిలిన రూట్లలో సెక్టార్లు, ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయని చెప్పింది. ఐదు రోజుల పాటు అంటే జూన్‌ 26 వరకు ఈ ఆఫర్‌ కింద టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. దీని కింద టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారు జూలై1 నుంచి సెప్టెంబర్‌ 30లోపు ప్రయాణాలు చేయవచ్చు. స్పైస్‌జెట్‌.కామ్‌తోపాటు ఇతర ట్రావెల్‌ పోర్టళ్లు, ట్రావెల్‌ ఏజెంట్ల ద్వారా ఈ ఆఫర్‌ ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఫస్ట్‌ కమ్‌-ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో సీట్లు కేటాయిస్తామని తెలిపింది. అయితే ఇది టిక్కెట్ ధర మాత్రమే ట్యాక్స్ లు మాత్రం అదనంగా ఉంటాయట.

No comments:

Post a Comment