Tuesday, June 14, 2016

లోయలో పడ్డ బస్సు

బస్సులో లోయలో పడి ఇద్దరి మృతి

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని దూలచెరువు ఘాట్‌ రోడ్డు నాలుగో మలుపు వద్ద  ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 24 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరు నుంచి కడప వస్తున్న ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున 5గంటల సమయంలో ఘాట్‌రోడ్డులోని నాలుగోమలుపు వద్దకు రాగానే అదుపుతప్పి లోయలోపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 ప్రయాణికులు ఉండగా వారిలో బస్సు కండక్టర్‌ రత్నం(45)తోపాటు మరో ప్రయాణికుడు మృతి చెందారు. 24 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు.

No comments:

Post a Comment