Thursday, June 16, 2016

రాయలసీమ మొనగాడు

సీమ నేతల సవాళ్ళు

ఇకపై డబ్బు కోసం అమ్ముడుపోయారని ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆ పార్టీ నాయకులను ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హెచ్చరించారు. డబ్బు కోసం పార్టీలు మారాల్సిన అవసరం తమకు లేదని, గత 30 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతోందని తెలిపారు. ‘కావాలంటే రేపే రాజీనామా చేస్తాం. తిరిగి మేం గెలిస్తే వైసీపీని మూసేస్తారా? ధైర్యముంటే ఈ సవాల్‌ను స్వీకరించాలి. నేను, నా కుమార్తె, ఎస్వీ మోహనరెడ్డి ముగ్గురిలో ఎవరు కావాలన్నా రాజీనామా చేస్తాం. వైసీపీ సిద్ధమా’ అని భూమా సవాల్‌ విసిరారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, తన కుమార్తె అఖిలప్రియతో కలిసి విజయవాడలోని సీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

No comments:

Post a Comment