Saturday, December 3, 2016

ప్రాణాలు తీసిన బొగ్గుగని

చైనా బొగ్గుగనిలో భారీ పేలుడు 21మంది మృతి


చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని ఖిటాయ్హె నగరంలోని ఓ  బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 21 మంది మృతి చెందినట్టు అధికారులు  ప్రకటించారు. గనిలో శిథిలాల కింద 22 మంది చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది 21 మంది మృతి చెందినట్టు నిర్ధారించారు. ఒక్కరు మాత్రం ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నారని, రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గనిలో పేలుడు ఘటనలో పోలీసులు అరెస్టులు ప్రారంభించారు. గని యజమాని, మేనేజర్ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

No comments:

Post a Comment