Saturday, December 3, 2016

నోట్లు వెదజల్లి ఏంజాయ్ చేశారు..

2వేలనోట్లతో కచేరి; గుజరాత్ లో అర్భాటంగా వివాహ వేడుక




నోట్ల రద్దుతో జనం అల్లాడుతుంటే  కొత్త నోట్లతో కొందరు సరదాలు చేస్తున్నారు. ప్రధానిమోడి జన్మభూమి గుజరాత్‌లో మాత్రం డబ్బులు ఎక్కువైనట్లుంది. రూ.2000 రూపాయిల కొత్త నోట్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ప్రముఖ గాయకుడు కీర్తిదాన్‌ గడ్విపై అభిమానులు రెండు వేల రూపాయిల వర్షం కురిపించారు. గుజరాత్‌‌లోని రాజ్‌‌కోట్‌లో ఓ వివాహవేడుకలో కీర్తిదాన్ కచేరీ జరిగింది. కార్యక్రమంలో ఆయన పాటకు ఖుషీ అయిన అభిమానులు రెండు వేల రూపాయిల నోట్లను విచ్చలవిడిగా వెదజల్లారు. ‌కొత్త నోట్ల కోసం గంటల తరబడి క్యూలో నిలబడి జనాలు నానా ఇబ్బందులు పడుతుంటే వీరికి వెదజల్లేంత డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ఒక్క సామాన్యుడికే.. సంపన్నులు కాదన్న మాట మరోసారి రుజువైందని నిపుణులు మండిపడుతున్నారు.

No comments:

Post a Comment