Saturday, December 3, 2016

టోల్ వలిచేయ్...

టోల్ గేట్ల వద్ద చిల్లర సమస్య; వాహనదారులకు తప్పనిపాట్లు



దేశవ్యాప్తంగా టోల్‌గేట్స్ వద్ద వాహనదారులకు ఇబ్బందులు ఎదరవుతున్నాయి. పాతనోట్లు చెల్లకపోవడం, రూ.2వేలకు చిల్లర లేకపోవడంతో టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్, నాగపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో జనం ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల పాత నోట్లు తీసుకుంటున్నా, రూ.2వేలకు పాత రూ.500 నోటును చిల్లరగా టోల్‌గేట్ల యాజమాన్యం ఇస్తున్నారు. దీంతో పాతనోట్లను ఎలా మార్చాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. అటు ముంబైలో టోల్‌గేట్ల వద్ద చిల్లర సమస్య ఎక్కువైంది. అందరూ రూ.2వేల నోట్లు ఇస్తుండటంతో చిల్లర లేక తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గంటల కొద్దీ టోల్‌గేట్ల వద్ద ఆగిపోవాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రూ.500నోట్లను తీసుకోకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. చాలా టోల్‌గేట్లలో స్వైపింగ్ మిషన్లు అందుబాటులో లేవు. దీంతో ప్రయాణికులకు టోల్‌గేట్ నిర్వాహకులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

No comments:

Post a Comment