Saturday, December 3, 2016

ప్రజారాజ్యమా....పోలీసు రాజ్యమా

రాష్ట్రంలో పోలీస్ రాజ్యం; కాలరాయబడుతున్న హక్కులు; సిపిఐ రామక్రిష్ణ



రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని, సమస్యలపై ఆందోళన చేస్తే ప్రజాస్వామ్య హక్కును కూడా కాలరాస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. హోం మంత్రి చినరాజప్ప నిమిత్తమాత్రుడని, శాంతిభద్రతలన్నీ పోలీసుల చేతుల్లో పెట్టేశారని విమర్శించారు. విశాఖ జిల్లా చింతపల్లి ఏరియా ధారకొండలో ఓ సభలో పాల్గొనేందుకు వెళ్ళిన తమపార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవివి సత్యనారాయణమూర్తిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్భంధించారని పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు సహా వామపక్ష నేతలు ఎక్కడ సమస్యలపై ఆందోళనకు దిగితే అక్కడ ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలకు పోలీసులు బరితెగించారని, ఈ చర్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. చిన్న ప్రదర్శన చేయాలన్నా అనుమతించడం లేదన్నారు. ఈ పోలీస్‌ చర్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి, భవిష్యత్‌ పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపైన, కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపైన చర్చించామన్నారు. అంశాలన్నింటిపైనా పవన్‌కళ్యాణ్‌ అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడించారు. పవన్‌తో కలిసి చర్చించిన అంశాలను సిపిఎం దృష్టికి కూడా తీసుకువెళ్ళి, రాబోయే కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కలిసి పని చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. 

No comments:

Post a Comment