Sunday, September 4, 2016

చిరంజీవిని జాతి క్షమించదట...కాపు కార్పోరేషన్ ఛైర్మన్


చిరుపై కస్సుమంటున్న కాపు  కార్పోరేషన్ ఛైర్మన్

ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని.. వాటికి అడ్డంకులు సృష్టిస్తే కాపు జాతి క్షమించదంటూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ లేఖ రాశారు. నగరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ లేఖను విడుదల చేశారు. ‘మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని, అయితే ఇటీవలకాలంలో మీ వ్యవహారశైలి కాపు సామాజికవర్గంలోని ప్రతి ఒక్కరికీ బాధ కలిగిస్తోంది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్‌ పన్నిన కుట్రలో భాగంగా రాజకీయ పునరావాసం లేని కొంతమంది నాయకులు సీఎంపై విమర్శలు చేస్తున్నారని, అటువంటి వారితో మీరు కూడా కలవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రామానుజ లేఖ సంగతి పక్కనపెడితే, కాపు కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉండి కనీసం కాపులను గుప్పిట్లో పెట్టుకోలేక పోతున్నాడని తెలుగుదేశం నేతలు రామానుజయకు రోజు తలంటుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పట్టుమని పదిమందికాపులను కూడా వెనుకేసుకుని తిరగలేని వ్యక్తికి కాపు ఛైర్మన్ ఎలా ఇచ్చారంటూ...అధినాయకత్వం తీరును బాహాటంగానే తప్పుపడుతున్నారట. నిన్నటికి నిన్న సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో కీలకంగా ఉండి అభాసుపాలై పార్టీకి బ్యాడ్ నేమ్ తెచ్చిన రామానుజయను సాగనంపి మరో కొత్త కాపుకు ఛైర్మన్ పదవి కట్టబెట్టాలని కాపుసామాజిక వర్గం అభిప్రాయపడుతుందట...

No comments:

Post a Comment