Sunday, September 4, 2016

వెంకన్న సన్నిధిలో సింధూ

కలియుగస్వామి మొక్కు చెల్లించుకున్న సింధూ

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధూ దర్శించుకున్నారు. కోచ్ గోపిచంద్‌, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి ఆమె తిరుమల చేరుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సింధు, ఆమె కుటుంబసభ్యులు సహా కోచ్ గోపీచంద్ స్వామి రిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఆహ్వానం పలికి ఏడుకొండల వాడి దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్శనం అనంతంరం సింధు స్వామి వారికి తులాభారంగా 68 కేజీల బెల్లాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం సింధు, గోపిచంద్ కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

No comments:

Post a Comment