Friday, September 9, 2016

పాస్ పోర్టు రద్దు చేశారు, భారత్ ఎలా రమ్మంటారు; విజయ్ మాల్యా


భారత్ రావడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఢిల్లీలోని పాటియాల కోర్టులో కింగ్‌ఫిషర్‌ మాజీ అధినేత విజయ్‌ మాల్యా పిటిషన్ వేశారు. అయితే పాస్‌ పోర్టు రద్దవడంతో భారత రాలేకపోతున్నానని చెప్పారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని న్యాయస్థానాన్ని కోరారు. విజయ్‌ మాల్యాకు గత వారం ముంబైలో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేశారు. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు ఎగ్గొట్టిన మాల్యా మార్చి 2వ తేదీన భారత నుంచి పారిపోయి లండన్‌లో తలదాచుకుంటున్నారు. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) ఎన్ని నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించడంలేదు.

No comments:

Post a Comment