Friday, September 9, 2016

కేంద్రంపై డైరెక్ట్ యటాక్ 


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో ‘సీమాంధ్ర ఆత్మగౌరవ సభ’ నిర్వహించనున్నారు. సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు పవన్ ప్రసంగించనున్నారు. సభ ముగియగానే పవన్ ఆమరణ దీక్షకు దిగనున్నట్లు సమాచారం అందుతుంది. కేంద్రం ఇచ్చిన హామీలు రెండున్నర సంవత్సరం గడిచినా అమలు చేయకపోవడంపై పవన్ దీక్ష చేయబోతున్నట్లుగా విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం. కేంద్రం వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ తర్వాత ఏపీ ఎంపీల మీద ఒత్తిడి తెచ్చాలా మూడు దశల్లో కార్యాచరణను పవన్ ఇది వరకే తిరుపతి బహిరంగ సభలో ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించేసింది.. సీఎం చంద్రబాబు స్వాగతించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక తిరుపతి సభలో చెప్పినట్లుగా మూడు దశల్లో పోరాటం అక్కర్లేదు.. డైరెక్టుగా కేంద్రంతో పోరాటానికి దిగాలని పవన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే కాకినాడ సభ ముగిసిన తరువాత సభా వేదిక పైనే దీక్ష‌ ప్రారంభించాలని పవన్ కృత నిశ్చయంతో ఉన్నట్లుగా సమాచారం. 

No comments:

Post a Comment