Saturday, September 3, 2016

అడ్డదారుల్లో అంబానీ...నిబంధనలకు టిటిడి తిలోదకాలు...

అంబానీకి టిటిడి రెడ్ కార్పెట్


రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుమారుడు అనంత్‌ అంబానీతో కలసి ఆయన వేకువజాము సుప్రభాతం, అభిషేకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించారు. ఇదే సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు తిరుపతి అలిపిరి వద్ద మూసివేసిన టోల్‌గేట్‌ను నిబంధనలకు విరుద్ధంగా వేవకుజాము 1 గంటకు తెరిచి అంబానీ కుటుంబం, సన్నిహితులతో కూడిన వాహనాలు తిరుమలకు అనుమతించటం విమర్శలకు తావిచ్చింది. దీనిపై మాట్లాడేందుకు టీటీడీ అధికారులు నిరాకరించారు.

No comments:

Post a Comment