Monday, May 16, 2016

తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరిల్లో ప్రారంభమైన పోలింగ్

తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరిల్లో ప్రారంభమైన పోలింగ్ 

MONDAY, MAY 16, 2016


తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉపఎన్నికల పోలింగ్‌ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఐదువేల మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళనాడు, కేరళ పుదుచ్ఛేరిల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులో 234 నియోజకవర్గాలున్నప్పటికీ 232 స్థానాల్లోనే పోలింగ్‌ జరుగుతోంది. అరవకురిచ్చి, తంజావూరులో ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని ఆర్కేనగర్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈ స్థానం నుంచి అత్యధికంగా 45 మంది పోటీచేస్తున్నారు. అటు కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని 30 స్థానాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్‌ఆర్‌సీ సహా అన్నాడీఎంకే, భాజపా, పీఎంకే పార్టీలు ఈసారి ఒంటరిగానే బరిలో ఉన్నారు. తెలంగాణా పరిధిలోని ఖమ్మం జిల్లా పాలేరులో ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. నియోజకవర్గంలో లక్షా 90వేల 351 మంది ఓటర్లున్నారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన రాంరెడ్డి వెంకటరెడ్డి(కాంగ్రెస్‌) హఠాన్మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉదయం 7గంటల ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికలను ప్రశాంతం నిర్వహించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 

No comments:

Post a Comment