Friday, May 13, 2016

నాచారంలో ఎగసిన అగ్నికీలలు

నాచారంలో  ఎగసిన అగ్నికీలలు

హైద్రాబాద్(తెలంగాణా); నాచారం పారిశ్రామిక వాడలో  భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రారిశ్రామికవాడలోని రోడ్‌ నెంబరు 18లో ఉన్న శాలిస్లైట్‌ రసాయన పరిశ్రమలో రియాక్టర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో సమీపంలోని ప్రజలు భయాందోళనతో పరుగుల తీశారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 10 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఘటనాస్థలిని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పరిశ్రమలోని రసాయన ట్యాంకర్లు పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకోవడంతో ప్రజలు శ్వాస సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పరిశ్రమలో భారీ పేలుళ్ల శబ్దాలకు స్థానికులు భయాందోళనకు లోనయ్యారు.
రిపోర్టర్; బూరుగ రమేష్, హైద్రాబాద్, తెలంగాణా, అమరావతి బ్రేకింగ్ న్యూస్

No comments:

Post a Comment