Sunday, May 29, 2016

ఎపి లెజెండ్

అమరావతిలో అన్నఎన్టీఆర్ భారీ విగ్రహం


తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావుకు ఎపి రాజధాని అమరావతిలో అరుదైన గౌరవం దక్కబోతుంది.  తారక రామునికి ఘన నివాళిగా రాజధానిలో ఎన్టీఆర్ 115 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ 35వ మహానాడు వేదికగా ఈవిషయాన్ని బహిర్గత పరిచారు. దీనిని పార్టీ శ్రేణులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.  ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని  మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుసహా పలువురు నేతలు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని పెడుతున్నారు,. తెలుగుజాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చిరస్మరణీయుడు ఎన్టీఆర్‌ విగ్రహం కూడా నెలకొల్పితే బాగుంటుంది’ అని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సభ కరతాళధ్వనులతో ఆమోదం తెలిపింది. ఆ ప్రతిపాదనపై సియం చంద్రబాబు స్పందిస్తూ 35వ మహానాడుకు గుర్తుగా అమరావతిలో 35 మీటర్ల ఎత్తైయిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రతిపాదనపై సభాప్రాంగణం కరతాళ ధ్వనులతో హర్హం వ్యక్తం చేసి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అమరావతిలో నిర్మించబోయే ఎన్టీఆర్ విగ్రహం తెలుగువారికి ‘ఆత్మగౌరవ స్ఫూర్తి’ నిస్తుందన్నారు.  ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఎంపీ మురళీమోహన ప్రతిపాదించారు. 

కృష్ణానది మధ్యలో విగ్రహం

ఎన్టీ ఆర్ విగ్రహాన్ని కృష్ణానది మద్య భాగంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. హైద్రాబాద్ ఉస్సేన్ సాగర్ లో బుధ్దుని విగ్రహం తరహాలో నీటి మధ్యలో ఏర్పాటు చేసి పర్యాటకులను అకట్టుకునే విధంగా నదిప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 
 

No comments:

Post a Comment