Tuesday, May 24, 2016

విషాదంగా మారిన కాశీ యాత్ర...

ఓరిస్సాలో రోడ్డు ప్రమాదంలో గుంటూరు భక్తులకు గాయాలు, ఒకరు మృతి


గుంటూరు నుంచి కాశీకి వెలుతున్న యాత్రికుల బస్సు మంగళవారం వేకువ జామున ఒడిశాలోని జాజుపూర్‌ ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తులశమ్మ అనే మహిళ మృతిచెందగా మరో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 10 మందిని కటక్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులంతా గుంటూరు జిల్లా నర్సరావుపేట నియోజకర్గానికి చెందినవారు. ఈనెల 20వ తేదిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో కాశీయాత్రకు బయలు దేరి వెళ్ళారు.

No comments:

Post a Comment