Saturday, May 14, 2016

మూడురాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం...పోలింగ్ కు సర్వంసిద్ధం

SATURDAY, MAY 14, 2016

మూడురాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం...పోలింగ్ కు సర్వంసిద్ధం



తమిళనాడు, కేరళ, కేంద్రపాలితప్రాంతమైన పుదుచ్చేరిలో హోరాథహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సోమవారం అనగా 16వతేదిన ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపధ్యంలో మూడురాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్ధులు డబ్బు, మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేశారు.  కేరళలో మొత్తం 2.61 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 140 శాసన సభ స్థానాలకుగాను మొత్తం 1,203 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో 109 మంది మహిళలు కూడా ఉన్నారు. తమిళనాడులో 5.79 కోట్ల మందికిపైగా ప్రజలు సోమవారం ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 234 శాసనసభ స్థానాలకుగాను 3,776 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో నలుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా ఉన్నారు. అన్నాడీఎంకే తరఫున జయలలిత, డీఎంకే తరఫున కరుణానిధి, డీఎండీకే తరఫున విజయ్‌కాంత్‌, పీఎంకే నుంచి అన్భుమణి రాందాస్‌లు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నారు. పుదుచ్చేరీలో 9.43 లక్షల మంది సోమవారం ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 30 అసెంబ్లీ స్థానాలకుగాను 300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

No comments:

Post a Comment