Monday, May 16, 2016

నేటి నుండి జగన్ జలదీక్ష

MONDAY, MAY 16, 2016

జగన్ జలదీక్ష



వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుండి నిరాహార దీక్ష చేపట్టనున్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఆయన దీక్షలో కూర్చుంటారు. మూడురోజుల పాటు దీక్ష కొనసాగనుంది. రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని టిడిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందుకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అక్రమప్రాజెక్టులు అడ్డుకోవడంలో విఫలమైనందుకు ఈ దీక్ష చేపడుతున్నట్లు జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా కృష్ణా నది నీటిని వినియోగించుకునేందుకు సిద్ధమౌతున్నా ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని వైకాపా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులను నిలిపివేయించేలా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకే జగన్‌ దీక్ష చేపడుతున్నట్లు పార్టీనేతలు ప్రకటించారు. 

No comments:

Post a Comment