Friday, May 13, 2016

అప్పులబాధతో అన్నదాత బలవన్మరణం

అప్పులబాధతో అన్నదాత బలవన్మరణం

గుంటూరు జిల్లా గురజాలలో జక్కా వెంకటేశ్వర్లు(45) అనే కౌలు రైతు గురువారం  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవడంతో వేసిన పంట చేతికి రాకపోవడంతో అప్పులు పాలై ఈ సంవత్సరం కూడా ఎలా ఉంటుందో అని మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకున్నాడు.గత రెండు సంవత్సరాలుగా పంట నననష్టపోవడంతో  సుమారు (20) ఇరవై లక్షలు అప్పు మిగిలింది. గతేడాది పది ఎకరాలు పంట సాగు చేయగా ఆరు లక్షలు అప్పు అయింది.ఈ యేడాది కూడా ప్రారంభ దశలో వర్షాలు కురవడంతో మళ్ళీ పది ఎకరాలు కౌలుకు తీసుకుని పొలంలో రెండు బోర్లు వేసి సాగుచేశాడు పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవక మరలా బోర్లు ఎండిపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక పోవడంతో సుమారు పద్నాలుగు లక్షలు(14) అప్పులు అయ్యాయి ఈ అప్పులు ఎలా తీర్చాలనే మనోవేదనకు గురై  ఇంటిలోనే దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సంఘటనా స్థలానికి యస్ ఐ సురేష్ చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు వున్నారు         రిపోర్ట్;బుచ్చిబాబు, గురజాల,అమరావతి బ్రేకింగ్ న్యూస్                                                                 

No comments:

Post a Comment