పొగాకు ధరలు పడిపోవటానికి వ్యాపారుల కూటమిగా ఏర్పడటమే కారణామా
పొగాకు రైతులను ప్రభుత్వం అదుకుంటుంది;ప్రత్తిపాటి
saturday, MAY 14, 2016
పొగాకు ధరలు పడిపోవటానికి వ్యాపారులంతా కూటమిగా మారటమే కారణమని ఎపి వ్యవసాయం శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. పొగాకు మార్కెట్లో నెలకొన్న సంక్షోభం, రైతుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఒంగోలు వేలం కేంద్రం-2లో శనివారం జరిగిన వేలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు వ్యాపారులు కూటమిగా ఏర్పడటం వల్లే ధరలు తగ్గుతున్నాయని వివరించారు. ఈ ఏడాది ఆంధ్ర సీజన్ కింద 120 మిలియన్ల పొగాకు పంట ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా.. 126 మిలియన్లు ఉత్పత్తి జరిగిందన్నారు. ఎగుమతిదారులు, సిగరెట్ తయారీ సంస్థలు ఇచ్చిన ఇన్నెంట్ ప్రకారం కొనుగోలు చేయాలని కోరారు. పొగాకు ధరల సమస్యలపై వచ్చే వారంలో కేంద్ర వాణిజ్య శాఖమంత్రి నిర్మలాసీతారామన్తో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు సిండికేట్ అయితే ఒకటి రెండు రోజులు వేలంను నిలుపుదల చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, తెదేపా సీనియర్ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి, పొగాకు బోర్డు ఈడీ పట్నాయక్, సంతనూతలపాడు తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీఎన్ విజయ్కుమార్ ఒంగోలు ఎమ్సీ ఛైర్మన్ సింగరాజు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment