Thursday, May 26, 2016

నేను నమ్మితే అంతే

రాజ్యసభకు సాయిరెడ్డి నామినేషన్ దాఖలు



వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ శాసనసభ కార్యదర్శి సత్యనారాయణరావుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించిన జగన్ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరును ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. విజయానికి కావాల్సినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు. పెద్దల సభలో రాష్ట్రం తరపున వాయిస్ వినిపిస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. సాయిరెడ్డి అభ్యర్ధిత్వంపై వైసిపి అధినేత జగన్ మాట్లాడుతూ సాయిరెడ్డి విలువలకు కట్టుబడ్డారని, అక్రమ కేసుల్లో తనకు వ్యతిరేకంగా చెప్పమని ఆయనపై  వత్తిడి తెచ్చారని వైఎస్ జగన్ అన్నారు. కానీ సాయిరెడ్డి సత్యాన్ని నమ్ముకున్నారని, వాస్తవాలనే చెప్తానని స్పష్టం చేశారన్నారు. అందుకే తనపై కేసుల సందర్భంగా ఆయనను కూడా నిందితుడిగా చేర్చారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా సాయిరెడ్డి నైతిక విలువలకు కట్టుబడి, అండగా ఉన్నారన్నారు. విశ్వసనీయులకు సరైన స్థానం కల్పిస్తామనే సంకేతం పంపడానికే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించినట్లు వైఎస్ జగన్ తెలిపారు. 
                                        

No comments:

Post a Comment