Tuesday, May 24, 2016

అమరావతిలో మేము భాగస్వాములమవుతామంటున్న జపాన్ కంపెనీలు

ఎపి రాజధానిలో జపాన్ బృందం



జపాన్‌ బృందం  అమరావతిలో పర్యటించింది. వెలగపూడికి చేరుకున్న జపాన్‌ బృందానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను బృంద సభ్యులు పరిశీలించారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక రంగానికి ఉన్న అనుకూలతలపై ఈ బృందం అధ్యయం చేయనుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన త్రీడి చిత్రాన్ని పరిశీలించారు. స్ధానిక పరిస్ధితులను సిఆర్డిఎ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

No comments:

Post a Comment