Saturday, May 14, 2016

మనస్సు కరిగిస్తామంటున్న దేశం నేతలు....ఎవరది...ఎందుకు

SATURDAY, MAY 14, 2016

మేం బిజెపిని వీడం-ఎపి ప్రజలు హోదాని వదులుకోరు;డొక్కా


ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజల్లో భావోద్వేగాలు ఉన్నాయంటున్నారు టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్. విభజన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రమే హమీ ఇచ్చిందన్నారు. దీనిని వదులు కోవడానికి ఎపి ప్రజలు సిద్ధంగాలేరన్నారు. హోదా ఇవ్వాలని సియం చంద్రబాబు అనేక మార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారని డొక్కా ఈ సందర్భంగా గుర్తు చేశారు. విభజన చట్టంలోని అంశాలు, లోటు బడ్జెట్,  స్పెషల్ స్టేటస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. హోదా ఇచ్చే విషయంలో బిజెపికి పరిమితులుంటే అది టిడిపికి సంబంధం లేదన్నారు. కేంద్రాన్ని ఒప్పించి,  మనస్సు కరిగించి ప్రత్యేక హోదా సాధించడానికి కృషి చేస్తామన్నారు. జగన్ కృష్ణా జలాల ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టేలా దీక్షలు చేయటం సరికాదన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. 

No comments:

Post a Comment