Tuesday, May 24, 2016

రెండో ముద్దాయి భాజాపానే అన్న విషయం దేశం నేతలకు ఇప్పుడెలా తెలిసింది

విభజనలో తొలిముద్దాయి కాంగ్రెస్,..రెండో ముద్దాయి కాషాయపార్టీనే; జివియస్


రాష్ట్ర విభజనలో తొలిముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి బిజెపినే అంటూ గుంటూరు టిడిపి జిల్లా అధ్యక్షుడు , వినుకొండ ఎమ్మెల్యే జివియస్ అంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షమైన బిజెపిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్నిరేపుతున్నాయి. బిజెపి నేతలు కేంద్రంపై వత్తిడి తేకుండా ఉంటే ఆనాడు రాష్ట్ర విభజనే జరిగి ఉండేది కాదన్నారు. విభజనలో బిజెపికి భాగముందన్న ఆంజనేయులు, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చటంతోపాటు, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. 

                      ఇదిలా వుంటే టిడిపి నేతలు రోజురోజుకు బిజెపిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం చూస్తుంటే చంద్రబాబు ఢిల్లీ టూర్ పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. బాబు టూర్ తరువాతే దేశం నేతలు బిజెపి పై ఒంటికాలిపై దూకుతుండటం చూస్తుంటే ఢిల్లీ టూర్ టిడిపి ఆశలను అడియాశలు చేశాయన్న విషయం స్పష్టమౌతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భాజాపాతో బెడిసి కొట్టటం వల్లే దేశం నేతలు కొంత అయోమయంలో పడ్డట్టు తెలుస్తుంది. నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ విభజనకు కారణమన్న వారు, హఠాత్తుగా బిజెపి విభజనకు కారణమని ఆరోపిస్తుండటం విస్మయాన్నిగొలుపుతుంది. రాష్ట్ర ప్రజలు సైతం దేశం నేతల మాటలకు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన బిజెపితో ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని చెట్టాపట్టాలేసుకుని అధికారంలోకి వచ్చి తీరా ఇప్పుడు విమర్శలు చేస్తుండటంపై పలువురు పెదవి విరుస్తున్నారు.

No comments:

Post a Comment