Friday, May 27, 2016

తమ్ముళ్ల పండగ...తిరుపతి కళకళ...అంధ్రనాడు

మహానాడు


 35వసంతాల తెలుగుదేశం పార్టీ మహాపండుగ మహానాడు ప్రతిష్టాత్మకంగా జరగనుంది.  రెండు తెలుగురాష్ట్రాలు సహా వివిధ ప్రాంతాలనుంచి ప్రతినిధుల సమావేశాలకు తరలిరానున్న నేపధ్యంలో తభారీగా ఏర్పాట్లు చేశారు. టిడిపి జాతీయపార్టీగా ఆవిర్భవించిన తరవాత తిరుపతి వేదికగా తొలిగా నిర్వహిస్తోన్న మహానాడు  కావడం.. దీనికితోడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సొంతజిల్లా కావడంతో ప్రతిష్ఠాత్మకంగా దీన్ని చేపట్టారు. గత రెండువారాల ముందునుంచే పార్టీశ్రేణులు ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేపట్టారు. నెహ్రూ మున్సిపల్‌ మైదానం వేదికగా ఏర్పాటైన ప్రధానవేదిక విద్యుద్దీపాల వెలుగులో విరాజిల్లుతోంది. వేదికను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఎటుచూసినా పసుపుమయమే. సంబంధిత కమిటీలన్నీ అహర్నిశలూ శ్రమించడంతో పనులు పూర్తయ్యాయి. మొత్తం 30వేలమంది ప్రతినిధులు కూర్చునే వీలుగా గ్యాలరీలు బ్యారికేడ్‌ల నడుమ ఏర్పాటయ్యాయి. ప్రధాన వేదికకు సమీపానే సాంస్కృతిక కార్యక్రమాల వేదిక ఏర్పాటైంది. ఇరువైపులా మీడియా.. వీవీఐపీ, వీఐపీ, ప్రతినిధుల గ్యాలరీలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా భద్రతాదళాల కనుసన్నల్లోకి వెళ్లిపోయాయి.
ప్రహరీగోడ అవతలివైపున.. భోజనాలు ఏర్పాటుచేశారు. మొత్తం 20 స్టాళ్లను అందుబాటులో ఉంచారు. ఇక ముఖ్యమంత్రి సహా వీవీఐపీలకు పాఠశాల లోపల భోజనవసతి కల్పించారు. ఇప్పటికే నోరూరించే వంటకాలు వచ్చేశాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాంగణం వద్ద సరిపడా తాగునీరు, మజ్జిగను ఏర్పాటుచేయనున్నారు. విద్యుద్దీపాల వెలుగుజిలుగులు.. పసుపువర్ణ కాంతులు.. నవ్యాంధ్ర రాజధాని అమరావతి.. గౌతమబుద్దుడు.. పసుపుతోరణాల రెపరెపలు.. తెలుగుదేశం వైశిష్ట్యాన్ని అణవణవునా ప్రతిబింబింపజేసే అత్యద్భుత చిత్రాలతో వేదికను తీర్చిదిద్దారు. చంద్రబాబు తనయుడు లోకేష్ ఏర్పట్లను స్వయంగా పార్టీ నేతలతో కలసి పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment