Saturday, November 26, 2016

తెలంగాణాలో పెరిగిన పోలీసుల ఆత్మహత్యలు

రివాల్వర్ తోకాల్చుకుని ఎస్సై ఆత్మహత్య


ప్రధాని బందోబస్తు విధుల నిమిత్తం నగరానికి వచ్చిన ఓ ఎస్సై రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ఉమెందర్‌ కథనం ప్రకారం.. కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి పోలీసు స్టేషన్‌లో శ్రీధర్‌ ఎస్సైగా పనిచేస్తున్నాడు. 2012లో ఎస్సైగా రిక్రూట్‌ అయ్యాడు. ప్రధాని బందోబస్తు కోసం రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. బందోబస్తులో భాగంగా రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలో గల 20 అంతస్తుల భవనంలోని 19వ అంతస్తులో నిలబడి గస్తీ నిర్వహిస్తున్నాడు. ఈ రోజు ఉదయం 9:30గంటల సమయంలో విధుల్లో ఉండగానే తన రివాల్వర్‌తో చాతి భాగంలో కాల్చుకున్నాడు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. రివాల్వర్‌ శబ్దం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహరం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment