Sunday, November 27, 2016

ముద్రగడను మోహన్ బాబు ఎందుకు కలిశాడు

ముద్రగడ ఇంటికి వెళ్ళిన మంచు మోహన్ బాబు



చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్ని శక్తులు ఏకమవుతున్నాయి. కాపు ఉద్యమాన్ని తీవ్రస్ధాయిలో నడుపుతున్న ముద్రగడకు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది.  ఇప్పటికే వైసిపి ప్రత్యేక్షంగానే ముద్రగడ పోరాటానికి మద్దతు తెలుపుతుండగా అటు సినీఇండస్ట్రీ  దాదాగా పిలవబడుతున్న దాసరి  నారాయణరావు ఇప్పటికే కాపుపోరాటానికి తెరవెనుక వ్యూహకర్తగా మారారు. చిరంజీవితోపాటు ఇతర సినీప్రముఖులు కూడా ముద్రగడకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. తాజాగా సినీనటుడు మంచు మోహన్ బాబు ముద్రగడను కలవటం చర్చనీయాంశంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం స్వగృహంలో ఆయన కుటుంబ సభ్యులను సినీనటుడు మోహన్‌బాబు దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. కాపు జాతి కోసం ముద్రగడ చేస్తున్న పోరాటంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తనను ముద్రగడ ఆహ్వానించలేదని.. తానే ముద్రగడకు ఫోన్‌ చేసి మీ ఇంటికి వస్తున్నానని చెప్పానని మోహన్‌బాబు వెల్లడించారు. మోహన్ బాబు ముద్రగడను కలవటం చూస్తుంటే భవిష్యత్తులో ఎపిలో  ఎదో జరగబోతుందన్న సంకేతాలకు ఇది స్పష్టత ఇస్తున్నట్లవుతుంది. మోహన్ బాబు ముద్రగడ ఇంటికి వెళ్ళటంపై ఇప్పటికే ఇంటలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారాన్ని చేరవేసినట్లు తెలుస్తుంది.

No comments:

Post a Comment