Friday, November 4, 2016

మావో అగ్రనేత సేఫ్

ఆర్ కె క్షేమంగానే ఉన్నారు; వరవరరావు



ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌ అనంతరం ఆచూకీ లేకుండా పోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ అలియాస్‌ ఆర్కే క్షేమంగానే ఉన్నాడని తమకు సమాచారం అందినట్లు పౌర హక్కుల సంఘం నేత వరవరరావు చెప్పారు. ఎన్‌కౌంటర్‌ అనంతరం ఆర్కే జాడ లేకపోవడంతో తామంతా ఆందోళన చెందామన్నారు. చివరకు పదిరోజుల తర్వాత ఆయన క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఏవోబీతో పాటు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పోలీసుల నిర్బంధం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. గాలింపు చర్యలు వెంటనే నిలిపివేయాలని కోరారు. ఏవోబీలో మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపారనడంలో సందేహం లేదని, ఈ ఘటనపై న్యాయ విచారణజరపాలని డిమాండ్‌చేశారు. ఏవోబీలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత మావోయిస్టు పార్టీలో కీలకనేత ఆర్కే కనిపించకుండా పోవడంతో పెద్దఎత్తున పౌరహక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేయటంతోపాటు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. ఆర్కె సేఫ్ గా ఉన్నాడన్న సమాచారం అందటంతో వారందరికి  కొంత ఊరట లభించింది.

No comments:

Post a Comment