Tuesday, November 8, 2016

ఇంటి యజమాని మందలింపు...ఇల్లాలి ఆత్మహత్య

కూకట్ పల్లిలో వివాహిత ఆత్మహత్య; ఇంటి యజమాని దూషించటమే కారణం


సున్నిత మనస్తత్వంతో ఇటీవలి కాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. నిన్నటికి నిన్న ప్రొఫెసర్ మందలించిందిందన్న కారణంగా వైద్య విద్యార్ధిని గుంటూరులో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసిన కొద్దిరోజులుకే కూకట్ పల్లిలో ఇంటి ఓనర్ దూషించాడన్న కారణంతో ఓ ఇల్లాలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరని కలవర పరిచింది. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్టేషన్‌ పరిధిలో  జరిగింది. కూకట్‌పల్లి మెడికల్‌ సొసైటీలోని ప్రసన్నకుమార్‌, స్నేహ‌ల‌త‌ దంపతులకు చెందిన ఇంటి మొదటి అంతస్తులో రామకృష్ణ, సుజాత దంపతులు అద్దెకు నివాసముంటున్నారు. గ్రౌండ్‌ ప్లోర్‌లో యజమానులు వుంటున్నారు. ఆదివారం సాయంత్రం పిల్లలు ఆడుకునే సమయంలో ఇంట్లో నుంచి శబ్ధాలు ఇంటి యజమానికి వినిపించాయి. దీంతో ఆగ్రహించిన యజమాని దంపతులు సుజాతను పరుష పదజాలంతో దూషించారు. ఆ సమయంలో సుజాత భర్త రామకృష్ణ ఇంట్లో లేరు. రామకృష్ణ ఇంటికి తిరిగి వచ్చేసరికి సుజాత ఉరేసుకుని ఉండటంతో కన్నీరుమున్నీరయ్యాడు.

తన చావుకు కారణం ఇంటి యజమాని దంపతులేనని..తన భర్త లేని సమయంలో వారు తనను అవమానపరిచారని.. దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుజాత గోడలు, తలుపులపై రాసింది. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమానులు పరారీలో వున్నారు.

No comments:

Post a Comment