Friday, November 4, 2016

అద్దె మైకు గాలి మాటలు....

జగన్, దిగ్విజయ్ మంతనాల వెనుక రహస్యం ఏమిటి; టిడిపి గాలి ముద్దుకృష్ణ


మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని నాశనం చేసిన చరిత్ర దిగ్విజయ్‌ సింగ్‌దని గాలి ముద్దుకృష్ణ ఆరోపించారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో రెండు గంటలపాటు జగన్‌తో దిగ్విజయ్‌ రహస్య మంతనాలు బయటపెట్టాలని గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. ఏపీలో విహారయాత్రకు వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని గాలిముద్దుకృష్ణమ అన్నారు. ఆగస్టా, బొగ్గు, 2జీ స్పెక్ట్రం కుంభకోణాల్లో దిగ్విజయ్‌ హస్తం ఉందని గాలి ఆక్షేపించారు. డిగ్గీరాజా కాదు...సూట్‌కేసుల రాజా అని గాలిముద్దుకృష్ణమ విమర్శించారు. దిగ్విజయ్‌ ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అ రాష్ట్రం నాశనమేనన్నారు. ఇదిలా వుంటే గాలి ముద్దు కృష్ణ మాటలపై చాలా మంది సెటైర్లు కూడా వేస్తున్నారు. డిగ్గీరాజా సూట్ కేసురాజా అయితే...టిడిపి నుండి కాంగ్రెస్ కు...కాంగ్రెస్ నుండి టిడిపిలోకి ఇలా రంగులు మార్చే అవకాశవాది గాలిని ఏమనాలంటున్నారు...ఎవరు అధికారంలో ఉంటే ఆపార్టీకి అద్దె మైకుగా గాలి బాగా ఉపయోగపడతాడంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

No comments:

Post a Comment