Friday, November 4, 2016

శబరిమలకు ప్రత్యేక రైళ్ళు

అయ్యప్ప యాత్రికులకోసం ప్రత్యేక రైళ్ళు


శబరిమలైకి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే సీనియర్‌ డీసీఎం కే ఉమా మహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. నెంబర్‌ 06336 కొచ్చువేలి - గువహటి ప్రత్యేక రైలు ఈ నెల 13, 20, 27, డిసెంబర్‌ 4, 11, 18, 25 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.05 గంటలకు గుంటూరు వచ్చి బుధవారంలలో ఉదయం 8.45 గంటలకు గువహటి చేరుకొంటుంది. నెంబర్‌ 06335 గువహటి - కొచ్చువేలి రైలు ఈ నెల 16, 23, 30, డిసెంబర్‌ 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 11.25 గంటలకు బయలుదేరి శుక్రవారంలలో రాత్రి 8.55 గంటలకు వచ్చి శనివారం రాత్రి 10.30 గంటలకు కొచ్చువేలి చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఎనిమిది స్లీపర్‌క్లాస్‌, ఆరు జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచలుంటాయని , ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్ళు నడుపుతున్నట్లు చెప్పారు.

No comments:

Post a Comment