Tuesday, November 8, 2016

అన్న ఎన్టీఆర్ తరువాత చంద్రబాబే



    ప్రజాపాలన టిడిపితోనేసాధ్యం; మంత్రి పత్తిపాటి

    ప్రజాపాలన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల మండల పరిధిలోని కనపర్రు, అమీన్‌సాహెబ్‌పాలెం, ఇర్లపాడు గ్రామాల్లో జనచైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం లేని సమాజంతో పాటు నిరుపేదల జీవనంలో మార్పు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షనేత జగన్ తాను అవినీతి బురదలో చిక్కిందికాక అందరికి ఆబురదను అంటించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. మల్లాయపాలెం గ్రామస్థులు పలువురు వైకాపాకు రాజీనామ చేసి తెదేపాలో చేరారు. చిలకలూరిపేట మార్కెటింగ్‌ యార్డు ఛైర్మెన్‌ నెల్లూరి సదాశివరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ కరీముల్లా, జిల్లా కార్యదర్శి ఎస్‌ఎస్‌.సుభానీ, యార్డు మాజీ ఛైర్మెన్‌ తేళ్ల సుబ్బారావు, సర్పంచులు కుంభా సాంబయ్య, రంగనాథుల నాగేశ్వరరావు, సొసైటీ ఉపాధ్యక్షుడు పూదోట అంతయ్య, యార్డు, సొసైటీ డైరెక్టర్లు పూర్నె హనుమంతరావు, కందిమళ్ల హరిబాబు, డీసీ ఛైర్మెన్‌ రంగనాథుల బ్రహ్మయ్య, సాగునీటి సంఘం అధ్యక్షుడు పూదోట మరియదాసు, ఎంపీటీసీ నాగోతు సుందరరాజు, చింతలపూడి వెంకయ్య చౌదరి, తదితరులున్నారు.

    No comments:

    Post a Comment