Friday, November 4, 2016

ఇంధనం లేకుంటే బండినడవదే...

పెట్రోల్ డీలర్ల మెరుపు సమ్మె


పెట్రో బంక్‌ డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు. కమీషన్‌ పెంచాలన్న ప్రధాన డిమాండ్‌తో దశల వారీగా ఆందోళనకు సిద్ధమయ్యారు. తొలుత రెండు రోజుల పాటు కంపెనీల నుంచి కొనుగోళ్లు నిలిపి వేస్తున్నారు. ఈ మేరకు గురువారం తొలిరోజు కంపెనీల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేశారు. శుక్రవారం కూడా ఇదే కొనసాగించనున్నారు. ఆ తర్వాత శనివారం నుంచి ఒకే షిష్ట్‌లో అమ్మకాలు జరపాలని పెట్రో డీలర్లు నిర్ణయించారు. ఆ మేరకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7వరకే పెట్రో అమ్మకాలు కొనసాగిస్తారు. ఇక ఆదివారం నుంచి ఆందోళనను ఉధృతం చేయనున్నారు. ప్రతి ఆదివారంతో పాటు, బ్యాంక్‌ల సెలవు రోజుల్లో బంక్‌లు మూసివేయాలని పెట్రో డీలర్లు నిర్ణయించారు. ఈనెల 15న దేశవ్యాప్తంగా బంక్‌ల బంద్‌ పాటించనున్నారు.

No comments:

Post a Comment