Sunday, October 30, 2016

మాంసం తింటే ఆయుష్షు తగ్గుతుందా....

మాంసాహారులు తస్మాత్ జాగ్రత్త


మాంసాహారులలో.. ముఖ్యంగా మేక, గొర్రె తదితర జంతువుల మాంసాన్ని రోజూ తినేవారిలో మరణాల రేటు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. శాకాహారులతో పోలిస్తే.. నిత్యం మాంసం తినేవారి ఆయుర్దాయం తక్కువని ఈ పరిశోధనలో వెల్లడైందని మాయో క్లినిక్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. తాజా ఆవిష్కరణతో మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందనే విషయం సుస్పష్టమైందని ఈ పరిశోధనలో పాల్గొన్న బ్రూక్‌ షీల్డ్‌ లారెంట్‌ వివరించారు. ఈ అంశంపై ఇటీవల జరిగిన ఆరు పరిశోధనలను విశ్లేషించి మరణాల రేటుపై ఆహారపుటలవాట్ల ప్రభావాన్ని తెలుసుకున్నామని తెలిపారు. ఈ పరిశోధనలలో సుమారు 15 లక్షల మంది వలంటీర్లను, వారి ఆహారపుటలవాట్లను గమనించారన్నారు. ఇందులో ప్రాసెస్డ్‌ అన్‌ ప్రాసెస్డ్‌ రెడ్‌ మీట్‌ వల్ల మరణాల శాతం స్వల్పంగా పెరుగుతున్నట్లు గుర్తించామని వివరించారు.


No comments:

Post a Comment