Thursday, October 20, 2016

అక్టోబర్ 31నాటికి ముసాయిదా ఓటర్ల జాబితా సిద్థం

ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేయండిత; కలెక్టర్లకు భన్వర్ లాల్ అదేశాలు


ప్రకాశం; రాష్ట్రంలో అక్టోబరు 31 నాటికి ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి ఆయన  జిల్లా కలెక్టర్లు, ఈఆర్వోలు, సహాయ ఈఆర్వోలతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా ఓట్లు చేర్చుకునే అంశంపై విస్తృత ప్రచారం చేయాలని, రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాల ఏర్పాటుకు ఎన్నికల సంఘంకార్యాలయం నుంచి సాంకేతిక సిబ్బందిని పంపిస్తామన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి విద్యార్థులు, రాజకీయ పార్టీలు, మేథావులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 

No comments:

Post a Comment