Tuesday, October 25, 2016

పవన్ కళ్యాణా మాజాకా....

ప్రత్యేక హోదా సాధనతో జనంలోకి; 2019  ఎన్నికలే టార్గెట్



2019 ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పక్కా ప్లాన్ తో ముందుకు కదులుతుంది. ప్రత్యోక హోదాను ప్రధాన అయుధంగా చేసుకని జనంలోకి విస్తృతస్ధాయిలో వెళ్ళేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈక్రంలోనే జనసేన పార్టీ ఆధ్వర్యంలో నవంబర్‌ 10న అనంతపురం జిల్లాలో భారీ బహిరంగసభజరగనుంది. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఈ సభకు హాజరై ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతీ జిల్లాలో పోరాట సభను జనసేన నిర్వహిస్తుందని పవన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయలసీమలో వెనుకబడి ప్రాంతమైన అనంతపురంలో సభ జరపాలని పవన్‌కల్యాణ్‌ నిర్ణయించినట్లు జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీకి ప్రత్యేకహోదా వస్తే కరవుతో సతమతమవుతున్న అనంతపురం జిల్లాకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పవన్‌ అభిప్రాయపడ్డారు. ప్రత్యేకహోదా వల్ల వచ్చే నిధులతో జిల్లాను కరవు కోరల నుంచి కాపాడుకోవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతపురంలో సభా వేదిక, సమయం తదితర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

No comments:

Post a Comment