Sunday, October 23, 2016

ఇప్పటి దాకా స్లో...ఇకపై స్పీడు

అమరావతి నిర్మాణం ఇక శరవేగం; నారా లోకేష్


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణం ఇక నుండి వేగం పుంజుకోనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు టిడిపి జాతీయ పార్టీ ప్రదానకార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. రాజధానికి శంకుస్థాపన చేసి శనివారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఈ అంశంపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌ ద్వారా వ్యక్తం తెలిపారు. ’అమరావతికి శంకుస్థాపన చేసినప్పటినుంచి మనం ప్రగతిని సాధించాం. ఇప్పటి నుంచి దాని వేగం పెరుగుతుంది. ప్రపంచం మొత్తంమ్మీద భవిష్య నగరాలకు అమరావతి నమూనా రాజధానిగా నిలుస్తుంది. మనం కలసికట్టుగా మెరుగ్గా ఈ నగరాన్ని నిర్మించుకుందాం’ అని ట్వీట్‌ చేశారు. 

No comments:

Post a Comment