Wednesday, October 19, 2016

ఎమ్మెల్యే యరపతినేని కుమార్తె వివాహనానికి హాజరుకానున్న సియం చంద్రబాబు

నేడు గుంటూరులో సియం చంద్రబాబు పర్యటన


టిడిపి అధినేత, సియం చంద్రబాబును నాయుడు గుంటూరులో పర్యటించనున్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఆవిష్కరించనున్నారు. అనంతరం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుమార్తె రేణుక, తెదేపా నేత కంచేటి శివప్రసాద్‌ కుమారుడు వెంకటరామ్‌ల వివాహ వేడుకకు హాజరుకానున్నారు. స్తంభాలగరువులోని చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరిగే ఈ వివాహ వేడుకకు రాత్రి 8.00 గంటలకు చంద్రబాబు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో భద్రతాపరమైన ఏర్పాట్లలో పోలీసులు నిమగ్నమయ్యారు. సియం తోపాటు ఇతర మంత్రులు, విఐపిలు వివాహ వేడుకకు హాజరుకానున్నారు. విజయవాడ నుంచి రోడ్డుమార్గం ద్వారా గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి బుధవారం సాయంత్రం 5.30 గంటలకు చేరుకుంటారు. అక్కడ తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. తర్వాత పార్టీ కార్యాలయం నుంచి లక్ష్మీపురం రహదారి మీదుగా యరపతినేని కుమార్తె వివాహం జరిగే చేబ్రోలు హనుమయ్య ప్రాంగణానికి చేరుకుంటారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత కంకరగుంట ఓవర్‌బ్రిడ్జి మీదుగా విజయవాడ వెళ్తారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లను కార్యాలయ కార్యదర్శి ఎ.వి.రమణ, అర్బన్‌ ఏఎస్సీ భాస్కరరావు, జిల్లా పార్టీ నాయకులు దారపనేని నరేంద్ర తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

No comments:

Post a Comment