Friday, October 21, 2016

మహిళా ఛైర్ పర్సన్ కారు ఢీ

నన్నపనేని రాజకుమారి కారు ఢీకొని ఒకరికి గాయాలు


గుంటూరు నగర శివారులోని నందివెలుగు రోడ్డు వద్ద ఎపి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రయాణిస్తున్న కారు ఓ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. రాజకుమారి కారు ఢీకొనటంతో ద్విచక్రవాహనదారునికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్ధానికులు అతడిని హుటాహుటిన గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనను చూసి ఒక్కసారిగా నన్నపనేని రాజకుమారి షాక్ గురయ్యారు. బిపి తగ్గిపోవటంతో ఆమెను కూడా నగరంలోని రమేష్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 



No comments:

Post a Comment