Thursday, October 27, 2016

చంద్రబాబు కుటుంబానికే కాదు ఐదు కోట్ల మందికి మా అండ

చంద్రబాబు కుటుంబంతోపాటు ఐదుకోట్ల మంది ప్రజలను మేమే రక్షించుకుంటాం; డిజిపి సాంబశివరావు



ముఖ్యమంత్రిని, ఆయన కుమారుడిని అంతమొందిస్తామని మావోయిస్టులు విడుదల చేసిన లేఖపై డీజీపీ 'సాంబశివరావు ఘాటుగా స్పందించారు. ‘‘అది ఎవరు విడుదల చేశారో స్పష్టత లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు (సీఎ కుటుంబం)మాత్రమే కాదు.. ఐదుకోట్ల మందిని రక్షించుకొనే సత్తా ఏపీ పోలీ్‌సకు ఉంది! మావోయిస్టు ఏపీ కమిటీ పేరుతో విడుదలైన ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నాం’’ అని డీజీపీ తెలిపారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను బట్టే అక్కడ పెద్ద తలకాయలున్నట్టు స్పష్టమవుతోందని డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. ఏకే 47లు, ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఇన్సా్‌సలాంటి ఆయుధాలు పెద్ద లీడర్ల వద్దే ఉంటాయన్నారు. ఆర్‌కే, గాజర్ల రవి (ఉదయ్‌)లాంటి వారున్నారా? లేరా? అనేది స్పష్టంగా చెప్పకపోయినా గన్‌మెన్లున్నారు, పెద్ద తలకాయలుండొచ్చని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘అక్కడ యాభై మందిదాకా మావోయిస్టులు ఉన్నట్లు కిట్‌ బ్యాగుల ఆధారంగా గుర్తించాం. 28 మంది మాత్రమే చనిపోవడంతో మిగిలిన వారు పారిపోయారని భావించవచ్చు. వారి కోసం తీవ్రస్థాయిలో కూంబింగ్‌ జరుగుతోంది. మా బలగాల్లో అలసిపోయిన వారిని వెనక్కి రప్పించి, కొత్త వారిని పంపిస్తున్నాం’’ అని తెలిపారు. వరవరరావు, ఆర్‌కే భార్య ఆరోపణలను ప్రస్తావించగా... ‘ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం చేశారన్నారు.

No comments:

Post a Comment