Wednesday, October 19, 2016

బస్సుకన్న...ఎయిర్ బస్సే నయం

ఎయిర్ ఏషియా బంపర్ ఆపర్


ఎయిర్‌ఏషియా ఇండియా అన్ని సర్వీసులను కలుపుకొని రూ.899లకే టికెట్‌ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 23 వరకు అందుబాటులో ఉంటుంది. మార్చి 31, 2017 లోపల ఈ టికెట్లపై ప్రయాణం చేయవచ్చునని పేర్కొంది. ఈ రూ.899ల ధర ఇంఫాల్‌-గౌహతి మార్గానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఈ పథకం కింద కోచి- బెంగుళూరు మార్గంలో ప్రారంభ ధర రూ.999,కొచ్చి-హైదరాబాద్‌కు రూ.2699, గోవా-న్యూదిల్లీ రూ.3,199, జయపుర -పుణె రూ. 2,399లుగా నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది. ఎయిర్‌ఏషియా వెబ్‌సైట్‌ను పరిశీలించినట్టయితే బెంగుళూరు-దిల్లీ టిక్కెట్టు ధర ప్రస్తుతం రూ. 8000గా వుంది. అయితే ఈ కొత్త పథకం ద్వారా ఆ మార్గపు టిక్కెట్లు కేవలం రూ.2699లకే లభిస్తాయి.

No comments:

Post a Comment