Thursday, October 27, 2016

చంద్రబాబు కుటుంబానికి మావోల హెచ్చరికలు

ఎవోబి ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకుంటాం; మావోయిస్టు రాష్ట్ర కమిటీ పేర లేఖ విడుదల


‘ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకమని, దీనికి చంద్రబాబు, ఆయన కొడుకూ మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టులు హెచ్చరికలు చేశారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ పేరిట విడుదలైన లేఖలో  అవసరమైతే ఆత్మాహుతి దాడి కూడా చేస్తామంటూ ప్రకటించారు. ఏవోబీ హత్యాకాండకు సరితూగే ప్రతీకార చర్య కచ్చితంగా అమలు చేస్తామని అమరుల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.  తొమ్మిదేళ్లు రక్తం వాసనకు దూరంగా ఉన్న చంద్రబాబు గద్దెనెక్కిన మరుసటి రోజే... 21 మంది ఎర్రచందనం కూలీలసు దుర్మార్గంగా హత్య చేయించాడని ఆరోపించారు. చంద్రబాబు, మోదీ సర్కారు సంయుక్త కుట్ర ఫలితమే ఏవోబీ హత్యాకాండ అని తెలిపారు. మావోయిస్టులు మాట్లాడుకోవడానికి సమావైశమైన సంగతి తెలుసుకుని... వారికి అందే ఆహార పదార్థాల్లో కోవర్టు పద్ధతిలో మత్తు, విషం కలిపి, పడిపోయిన వారిపై విచక్షణా రహితంగా కాల్చి చంపారని ఆరోపించారు. ‘తుఫాన్లలో ఇది కొంచెం పెద్దది. నాలుగు రోజుల్లో తట్టుకొని నిలబడతాం’ అని ధీమా వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment