Friday, October 21, 2016

ఇసుకాసురుల పని ఇక అయిపోనట్లే

లింగాయపాలెం ఇసుకరీచ్ లో 20 లారీలు సీజ్



ఎపి ప్రభుత్వం ఇసుక అక్రమరవాణా దారుల భరతం పట్టే ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా క్రిష్ణ, గుంటూరు జిల్లాల్లోని ఇసుక రీచ్‌లలో తనిఖీలు చేపట్టారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సంయుక్త అధ్వర్యంలో జరుగుతున్న తనిఖీల్లో లింగాయపాలెంలో 20 ఇసుక లారీలను సీజ్‌ చేశారు. గుంటూరు జిల్లాలోని లింగాయపాలెం వెంకటపాలెం రీచ్‌లలో ఈ ఇసుక లారీలను అధికారులు పట్టుకున్నారు. ఇసుక మాఫియాలో కీలకపాత్ర పోషిస్తున్నవారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం హెచ్చరించినా పట్టించుకోని ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

No comments:

Post a Comment