Friday, October 28, 2016

మావోల లేఖ సృష్టికర్త ఎవరు

లోకేష్ జెడ్ కేటగిరి రక్షణకోసమే మావోల లేఖ సృష్టి; వరవరరావు



మావోయిస్టుల పేరిట బుధవారం వెలువడ్డ ఓ లేఖ సీఎం చంద్రబాబు సృష్టేనని, ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ మాదిరే ఓ బూటకపు ఉత్తరమని విరసం నేత జి.కళ్యాణరావు కొట్టిపారేశారు. సీఎం చంద్రబాబు తన కుమారుడికి జడ్‌ కేటగిరీ రక్షణ కల్పించుకునేందుకు ఈ రకమైన తప్పుడు ప్రచారాన్ని ఉత్తరం రూపంలో సృష్టించారన్నారు. విప్లవకారులు ప్రజా ఉద్యమాల్లోనే ఉంటూ ప్రాణత్యాగానికి సిద్ధపడతారే తప్ప, ఆత్మాహుతి దాడులకు పాల్పడరని, ఉత్తరం అంతా మోసమని కళ్యాణరావు అన్నారు. ఏవోబీలోని ఖనిజ సంపదను సంపన్నులైన కొద్దిమంది పెట్టుబడిదారులకు, బహుళ జాతి సంస్థలకు ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఇందుకు అడ్డుగా ఉన్న మావోయిస్టులను కోవర్టు ఆపరేషన్‌తో మత్తుమందు ఇచ్చి దారుణంగా కాల్చిచంపారని ఆరోపించారు. ఆర్కే కుమారుడు మున్నా అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన.. ఇది వందశాతం బూటకపు ఎన్‌కౌంటర్‌ అని చెప్పారు.

No comments:

Post a Comment