Wednesday, October 5, 2016

మార్కెట్ ఛైర్మన్ గా మన్నవ 6న బాధ్యతలు, 9న ఎన్టీ ఆర్ స్టేడియంలో బహిరంగ సభ

మార్కెట్ యార్డు ఛైర్మన్ గా మన్నవ - నేడే బాధ్యతలు


గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గా మన్నవ సుబ్బారావు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలుగుదేశం పార్టీలో దశాబ్ధకాలంగా క్రియాశీలక పాత్ర పోషించిన సుబ్బారావుకు ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి బాధ్యతలను సియం చంద్రబాబు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరుకు సమీపంలోని మేడికొండూరు చెందిన మన్నవ ,  గతంలో జెడ్ పిటిసి సభ్యునిగా జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి అశించినప్పటికీ, చివరి క్షణంలో పాతూరి నాగభూషణంకు ఆపదవి దక్కింది. 6వ తేది గురువారం ఉదయం 8గంటలకు గుంటూరు మార్కెట్ యార్డులో ఛైర్మన్ గా సుబ్బారావు బాధ్యతలు స్వీకరించనున్నారు. 9వ తేది సాయంత్రం 4గంటలకు గుంటూరు నగరంలోని ఎన్టీ ఆర్ స్డేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు . ఈకార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, శాసనభ్యులు, పార్టీ సినియర్ నేతలు హాజరు కానున్నారు.

No comments:

Post a Comment