Thursday, October 20, 2016

రాయపాటిని పరామర్శించిన గవర్నర్ నరసింహన్

రాయపాటిని పరామర్శించిన గవర్నర్ నరసింహన్


తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌.. నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును పరామర్శించారు. గురువారం గుంటూరు విచ్చేసిన గవర్నర్‌ రాయపాటి నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఇటీవల రాయపాటి సతీమణి మరణించిన నేపధ్యంలో గవర్నర్ రాయపాటి ఇంటికి వచ్చారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ఈ సందర్బంగా మీడియాతో రాయపాటి  మాట్లాడుతూ..
ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. గురజాలలో రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరతామని తెలిపారు.

No comments:

Post a Comment