Sunday, October 30, 2016

మావోల దళపతి ఆర్కె ఆచూకి ఎక్కడ

పోలీసుల వద్దే ఆర్కెతోపాటు మరో తొమ్మిది మంది మావోలు; దామోదర్నవంబర్ 3న 5రాష్ట్రాల బంద్ 



మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా - ఒడిసా సరిహద్దు(ఏవోబీ) రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జి అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారని ఆదివాసీ హక్కులు, సంస్కృతి పరిరక్షణ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దామోదర్‌ తిలక్‌ ఆరోపించారు. ఆర్కేతోపాటు మరో తొమ్మిది మంది మావోయిస్టులు, గిరిజనులు పోలీసుల అదుపులో ఉన్నారని ఆయన తెలిపారు. ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు దానియేల్‌ మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు శనివారం మల్కన్‌గిరి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్కే ఎన్‌కౌంటర్‌ సమయంలో గాయపడ్డారని, పోలీసులు ఆయన్ను నిర్బంధించినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. పోలీసులు ఏ క్షణంలోనైనా ఆర్కేను చంపే అవకాశముందన్నారు. విశాఖ ఏజెన్సీలో ఉన్న బాక్సైట్‌ గనులను దోచుకొనేందుకే పెట్టుబడిదారులు పోలీసుల ద్వారా మావోయిస్టులను హత్య చేయించారని తిలక్‌ ఆరోపించారు. మావోయిస్టులకు టీలో మత్తుమందు కలిపి ఇచ్చి, ఏకపక్షంగా కాల్పులు జరిపి చంపేశారన్నారు. ఏవోబీ అటవీ ప్రాంతంలో సీపీఐ మావోయిస్టు పార్టీ బలోపేతానికి ఏర్పాటు చేసిన సమావేశంలో 34 నుంచి 39 మంది వరకూ పాల్గొన్నట్టు సమాచారం ఉందన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల బంద్‌కు సీపీఐ మావోయిస్టు పార్టీ దర్వా డివిజన్‌ కమిటీ పిలుపునిచ్చింది. శనివారం దర్వా డివిజన్‌ కమిటీ మల్కన్‌గిరి జిల్లా విలేకరులకు హిందీలో ఓ ప్రకటనను పంపించింది. ఈ ప్రకటనలను మల్కన్‌గిరి నుంచి గిరిజన గ్రామాలకు వెళ్లే దారుల్లోనూ అంటించింది. ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌ పచ్చి బూటకమని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది.ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా నవంబరు 3న ఏపీ, తెలంగాణ, ఒడిసా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల బంద్‌కు సీపీఐ మావోయిస్టు పార్టీ దర్వా డివిజన్‌ కమిటీ పిలుపునిచ్చింది. శనివారం దర్వా డివిజన్‌ కమిటీ మల్కన్‌గిరి జిల్లా విలేకరులకు హిందీలో ఓ ప్రకటనను పంపించింది. ఈ ప్రకటనలను మల్కన్‌గిరి నుంచి గిరిజన గ్రామాలకు వెళ్లే దారుల్లోనూ అంటించింది. ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌ పచ్చి బూటకమని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది.

No comments:

Post a Comment